Planetary Parade: అంతరిక్షంలో అరుదైన అద్భుతం.. ఆ రోజు చూసేయండి!

అంతరిక్షం(The Space) అద్భుతాలతో నిండి ఉంటుంది. ప్రతి కొత్త అన్వేషణ(Innovations), కొత్త విషయాలు, రహస్యాలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. నక్షత్రాలు(Stars), గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ విశ్వంలోని అద్భుతాలే. ఇక మరికొన్ని రోజుల్లో ఖగోళ అద్భుతం జరగనుంది. ఫిబ్రవరి 28, 2025న ఖగోళ ప్రేమికులు ఓ అరుదైన దృశ్యాన్ని చూడబోతున్నారు. అంతరిక్షంలో ఏడు గ్రహాల పరేడ్ (Seven-Planet Parade) అనే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.

Don't Miss This Stunning Planetary Parade: Seven Planets Align in February  2025! - Science Magazine

2022లో ఐదు గ్రహాలు ఒకే వరుసలో..

ఈ రోజు నాడు సౌరమండలం(In the solar system)లోని ఏడు గ్రహాలు.. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, బుధ గ్రహాలన్నీ ఒకే లైన్‌(Same Line)లో దర్శనమివ్వనున్నాయి. భారత్, అమెరికా, మెక్సికో, కెనడా ప్రజలకు ఈ అద్భుతం కనువిందు చేయనుంది. ఈ వింతని టెలిస్కోప్‌(Telescope) లేకుండానే చూడొచ్చు. వీటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖపై ఉన్నట్లు కనపడతాయి. 2022లో ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనిపించాయి. కానీ ఏడు గ్రహాలు ఇలా ఒకేసారి ఒకే రేఖలో కనిపించడం చాలా అరుదు.

Explained: What Is Planetary Parade? Celestial Alignment To Take Place From  January 21

టెలిస్కోప్‌తో ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడొచ్చు..

అయితే ఇలాంటి గ్రహ సముదాయం(Planetary complex) ఒకే సరళ రేఖపై మళ్లీ 2040లోనే కనిపిస్తుంది. కాకపోతే ఐదు గ్రహాలే కనిపిస్తాయట. ఇలా ఏడు గ్రహాలు ఇలా కనిపించేందుకు మరికొన్ని దశాబ్దాలు పట్టొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు(Scientists). అందుకే ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. కొండలు లేదా బహిరంగ ప్రదేశాలు, తక్కువ కాంతి ఉండే ప్రాంతాల నుంచి వీటిని చూడొచ్చు. టెలిస్కోప్ ఉంటే ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడటానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *