SLBC Tunnel: కుప్పకూలిన SLBC సొరంగం.. పలువురికి గాయాలు

నాగర్ కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దోమలపెంట వద్ద SLBC టన్నెల్ నిర్మాణంలో ప్రమాదం జరింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ 14KM వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ (SLBC Tunnel) పనుల్లో అపశ్రుతి చోటుచేసుకోవడంతో అంతా షాకయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులను గాయాలు కాగా రెస్య్కూ సిబ్బంది(Rescue Team) వారిని బయటి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాద సమయంలో టన్నెల్లో 50 కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ ఆరా

ఇదిలా ఉండగా టన్నెల్‌ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్(CM Revanth) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌ వద్దపై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. SP, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy). ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్‌(Special helicopter)లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *