Virgin Boys Trailer: అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ‘వర్జిన్ బాయ్స్’.. ట్రైలర్ చూశారా?

రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్‌పై దయానంద్ గడ్డం(Dayanand Gaddam) రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్(Virgin Boys). ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి(Smaran Sai) సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద(kaushal Manda), ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్(Teaser) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా నుంచి ట్రైలర్‌(Trailer)ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Image

టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్‌

అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వర్జిన్ బాయ్స్(Virgin Boys) తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు(Iphones) గిఫ్ట్‌గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం తెలిపింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురిసి ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు మూవీ టీమ్ తెలిపింది. ట్రైలర్‌లో అడల్ట్ కామెడీతో పాటు ఎమోషన్స్‌ను కూడా చూపించారు. ప్రేమ, పెళ్లి ఎంత గొప్పవి.. ఆకర్షణకు లోనై ముగ్గురు యువకులు చేసిన తప్పు ఏంటి.. ? అనేది ట్విస్ట్ గా చూపించారు. ఇక ట్రైలర్ లో మిత్రా శర్మతో పాటు మిగిలిన హీరోయిన్స్ అందాలు ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్‌లో చాలా బూతులే గుప్పించారు. మరి మీరూ వర్జిన్ బాయ్స్ ట్రైలర్ చూసేయండి..

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *