ఇక కిక్కే కిక్కు.. ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు.. నేటి నుంచి దరఖాస్తులు

Mana Enadu : మందుబాబులకు గుడ్ న్యూస్. ఏపీలో నూతన మద్యం విధానాన్ని (AP Liquor Policy) రాష్ట్ర సర్కార్ తాజాగా ఖరారు చేసింది. రెండేళ్ల కాల పరిమితితో ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 2026 సెప్టెంబరు 30వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. మొత్తం 3వేల 396 మద్యం దుకాణాలకు లైసెన్సుల (Liquor Shops License) జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇవాళ ఉదయం (అక్టోబర్ 1వ తేదీ 2024) నుంచే దరఖాస్తుల (AP Liquor Policy Application) స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చని.. ఒక్కో దానికి రూ.2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాలని వెల్లడించింది.

డెబిట్, క్రెడిట్‌ కార్డుల (Credit Card) ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలని పేర్కొంది. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలని.. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నట్లు తెలిపింది.  ఈ నెల 11వ తేదీన లాటరీ ప్రక్రియ ఉండగా.. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు.

  • దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు.
  • తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు
  • ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు
  • రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు.
  • ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి.
  • రిటైల్‌ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్‌ ఉంటుంది.
  • నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్‌ స్టోర్స్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున అదనంగా లైసెన్సు రుసుము చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మంగళవారం ఉదయం 10 గంటల నుంచి
  • తుది గడువు: అక్టోబరు 9 వరకూ
  • లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేసేది: అక్టోబరు 11
  • లైసెన్సులు దక్కించుకున్న వారు దుకాణాలు ప్రారంభించే తేదీ: అక్టోబరు 12 నుంచి

Related Posts

Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం అనాసక్తి 

ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం నిర్వహించడానికి కేంద్రం అనాసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే…

West Indies cricket team: ఒలింపిక్స్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అవకాశం ఛాన్స్ దక్కేనా? 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే దానిపై క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఐసీసీని స్పష్టత కోరుతోంది. సాధారణంగా, వెస్టిండీస్ క్రికెట్ లో 15 దేశాలు లేదా ప్రాంతాల సమాహారంగా ఉంటుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *