Chandrababu | బాబు బెయిల్‌, కస్టడీపై విచారణ

అమరావతి:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించారు. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని, కస్టడీకి అనుమతించాలని ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు 12కు వాయిదా వేసింది. అప్పటివరకు అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించింది.

నారాయణ పిటిషన్‌ మరో బెంచ్‌కు మార్పు
ఏపీ మాజీ మంత్రి నారాయణకు అందిన 41ఏ నోటీసులపై విచారణను హైకోర్టు మరో బెంచ్‌కు మార్చింది. తమ బెంచ్‌ వద్దకు వచ్చిన ఈ పిటిషన్‌పై తాను విచారణ చేపట్టబోనని జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి పేర్కొనడంతో మరో బెంచ్‌కు బదిలీ చేశారు. విచారణకు రావాలని రెండు రోజులపాటు నారాయణపై ఒత్తిడి చేయవద్దని సీఐడీని ఆదేశించారు.

Related Posts

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

అలా చేయకుండా నోటిఫికేషన్లు ఇస్తే సీఎం కుర్చీ లాగేస్తాం: తీన్మార్ మల్లన్న

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddey), ఆ పార్టీ బహిష్కృత నేత, MLC తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు(Notifications) జారీ చేస్తే సీఎం రేవంత్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *