కూర్చుని నవ్వుతారా?.. జగన్‌పై స్పీకర్‌ అసహనం

ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions 2025) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశాల మొదటి రోజైన సోమవారం నాడు అసెంబ్లీలో వైస్సార్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో వైస్సార్సీపీ (YSRCP) సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని హితవు పలికారు.

జగన్ విజ్ఞతతో వ్యవహరించాలి

‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)ని ఉద్దేశిస్తూ) సభ్యత మరిచి ప్రవర్తించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి ఆయన కూడా వాళ్లతో కలిసి కూర్చుని నవ్వుకుంటారా? రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదు. ఇకనైనా జగన్‌ విజ్ఞతతో వ్యవహరించాలి. సభా మర్యాదను అందరు సభ్యులు కాపాడాలి.’ అని స్పీకర్ (AP Assembly Speaker) అయ్యన్నపాత్రుడు సూచించారు.

Related Posts

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణం?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు.. అప్పుడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కొత్త మంత్రుల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *