USలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థిని మృతి

అమెరికా (America)లో ఘోర రోడ్డు ప్రమాదం (Petal Road Accident) చోటు చేసుకుంది. కారు ఢీకొట్టడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. గుంటూరు జిల్లా (Guntur District)కు చెందిన దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (University Of North Texas)లో MS చదువుతోంది. గురువారం రాత్రి ఆమె రోడ్డుపై నడిచి వెళుతుండగా.. అతి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో దీప్తి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ సమాచారాన్ని ఇండియాలో ఉన్న మృతురాలి తల్లిదండ్రులకు అందజేశారు. కుమార్తె మృతి విషయం తెలిసిన దీప్తి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా ఇటీవల కాలంలో విదేశాలలో ఉంటున్న భారతీయులు (Indians) ఎక్కువగా మరణిస్తుంటడటం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *