
అమెరికా (America)లో ఘోర రోడ్డు ప్రమాదం (Petal Road Accident) చోటు చేసుకుంది. కారు ఢీకొట్టడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. గుంటూరు జిల్లా (Guntur District)కు చెందిన దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (University Of North Texas)లో MS చదువుతోంది. గురువారం రాత్రి ఆమె రోడ్డుపై నడిచి వెళుతుండగా.. అతి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో దీప్తి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ సమాచారాన్ని ఇండియాలో ఉన్న మృతురాలి తల్లిదండ్రులకు అందజేశారు. కుమార్తె మృతి విషయం తెలిసిన దీప్తి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా ఇటీవల కాలంలో విదేశాలలో ఉంటున్న భారతీయులు (Indians) ఎక్కువగా మరణిస్తుంటడటం ఆందోళన కలిగిస్తోంది.