గ్రూప్-2 పరీక్షపై APPSC కీలక ప్రకటన

విద్యార్థులకు అలర్ట్. గ్రూప్-2 మెయిన్ పరీక్షల (Group 2 Main Exams)పై ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్-2 మెయిన్ పరీక్ష యధావిధిగా జరుగుతుందని పేర్కొంది. ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్న వారిపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కమిషన్ అధికారులు తెలిపారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఆదివారం (ఫిబ్రవరి 23వ తేదీ) రోజున ఏపీ వ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌ – 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ – 2 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

Appsc1

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *