Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరానికి బాంబు బెదిరింపులు!

ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య (Ayodhya) రామ మందిరానికి బాంబు బెదిరింపులు (Bomb threats) రావటం కలకలం సృష్టించింది. రామమందిరాన్ని పేల్చేస్తామంటూ కలెక్టరేట్లకు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న CCTVలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ మేరకు అయోధ్య సైబర్ క్రైమ్ PSలో కేసు నమోదు చేశారు. కాగా తమిళనాడు(Tamilnadu) నుంచి ఇంగ్లిష్​లో మెయిల్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

డ్రోన్ నిఘాలోకి రామమందిరం

అయితే, అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. రామ మందిరాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ ఖలీస్థానీ(Khalistani) ఉగ్రవాది పన్నూ బెదిరించాడు. తరచూ ఈ తరహా ఉగ్ర ముప్పుల దృష్ట్యా అయోధ్య నగరంలోనూ, రామాలయ పరిసర ప్రాంతాల్లోనూ అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు మొత్తం ప్రాంతాన్ని డ్రోన్‌ నిఘా(Drone Surveillance)లోకి తీసుకొచ్చారు.

Image

అలర్టైన కేంద్ర హోంశాఖ

ఇదిలా ఉండగా ఇటీవల ముంబై దాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా(Tahavor Rana)ను భారత్ అరెస్టు చేసిన నేపథ్యంలో దేశంలో దాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు(Intelligence Agencies) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్యకు బెదిరింపులు రావడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. దీంతో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, ఆలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద నిఘా పెంచాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *