BCCI సెంట్రల్ కాంట్రాక్టు.. జాక్‌పాట్ కొట్టిన తెలుగు ప్లేయర్లు

టీమ్ఇండియా(Team India) ప్లేయర్ల సెంట్రల్ కాంట్రకుల(Central Contract) లిస్టును భారత క్రికెట్ బోర్డు(BCCI) ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 34 మంది క్రికెటర్లను 4 కేటగిరీలకు ఎంపిక చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోని A+ గ్రేడ్‌లో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు. గత ఏడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్‌ కోల్పోయిన స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar), ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan)కు మళ్లీ చోటు దక్కింది. మరోవైపు ఇటీవల అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి(Nitish Kumar Reddy)తో పాటు మరికొందరు యంగ్ ప్లేయర్లు ఈ సారి జాక్‌పాట్ కొట్టారు. ఛాన్స్ ఇచ్చింది.

BCCI Central Contract 2024-25 Announced: Rohit, Virat, Bumrah, Jadeja in A+  Grade; Shreyas Iyer, Ishan Kishan Reinstated | Udaipur Kiran

A+ గ్రేడ్‌లో నలుగురికే చోటు

ఈ మేరకు బీసీసీఐ ప్రకటించిన లిస్టులో A+ గ్రేడ్‌లో 4, A గ్రేడ్‌లో 6, B గ్రేడ్‌లో 5, C గ్రేడ్‌లో 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ స్టార్స్ నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి తొలిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు సంపాదించారు. వీరందరూ సి గ్రేడ్‌లో ఉన్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ B గ్రేడ్‌ నుంచి A గ్రేడ్‌కు పదోన్నతి పొందాడు. A+ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్లను బీసీసీఐ వేతనంగా ఇవ్వనుంది.

Tilak Varma and Nitish Kumar Reddy's Hyderabad Homecoming Highlights  India's Final T20I

4 కేటగిరీల ప్లేయర్లు ఇలా…

A+ గ్రేడ్‌: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్లు ఇవ్వనుంది.

A గ్రేడ్‌: మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమీ, రిషభ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున అందుతాయి.

B గ్రేడ్: సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.3 కోట్లు అందుతాయి.

C గ్రేడ్: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.1 కోటి చొప్పున అందిస్తుంది.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *