Bigg Boss 7 Telugu: సందీప్ ఎలిమినేషన్ అతనే కారణం..!

 

బిగ్ బాస్ సీజన్ 7 నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. సందీప్ ఎలిమినేషన్ తో ఇంటి సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. ఇక తేజ నా వల్లే ఎలిమినేట్ అయ్యాడని శివాజీ తో చెబుతూ కనీళ్ళు పెట్టుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 7 నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో జరిగిన సందీప్ (Sandeep) ఎలిమినేషన్ ఇంటి సభ్యులందరికీ పెద్ద షాకిచ్చింది. శనివారం ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న గౌతమ్, ప్రియాంక సేవ్ అయ్యారు. ఇక నిన్న ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న మిగతా ఆరుగురిలో అమర్, భోలే, అశ్విని, శివాజీ, ముందుగా సేవ్ అయ్యారు. చివరిలో శోభ, సందీప్, ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. వీళ్ళిద్దరిలో సందీప్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.

ఊహించలేదు నువ్వు ఎలిమినేట్ అవుతావని
ఇక ఎలిమినేట్ అయిన సందీప్ తో శివాజీ (Shivaji) మాట్లాడుతూ.. నేను అస్సలు ఊహించలేదురా, నువ్వు ఎలిమినేట్ అవుతావని అని బాధపడ్డాడు. యావర్, ప్రశాంత్, అమర్, ప్రియాంక అందరు సందీప్ కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

కన్నీళ్లు పెట్టుకున్న తేజ

సందీప్ నా వల్లే ఎలిమినేట్ అయ్యాడని తేజ (Teja) కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అయితే గత వారం నామినేషన్స్ లో.. తేజ, సందీప్ ను నామినేట్ చేశాడు. దానికి తేజ చెప్పిన రీజన్.. 7 వారాల నుంచి నామినేషన్ లో లేరు.. ఒకసారి వెళ్లి వస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పాడు. దీంతో సందీప్ ఎలిమినేట్ అవ్వడానికి తానే కారణమని ఫీల్ అయ్యాడు తేజ.
స్టేజ్ పైకి వచ్చాక.. నాగార్జున (Nagarjuna) సందీప్ తో మాట్లాడుతూ.. ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చావు ఎలిమినేట్ అయ్యావు ఊహించలేకపోయావు కదూ అన్నారు. ఇక సందీప్ తన బిగ్ బాస్ జర్నీ వీడియో చూసుకుని ఎమోషనల్ అయ్యాడు. వెళ్ళిపోతూ.. ఇంటి సభ్యులందరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు సందీప్. తేజ గురించి మాట్లాడుతూ.. తేజ ఇంట్లో అందరికన్నా చాలా తెలివైన వాడు, గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు సందీప్.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *