రేవంత‌న్న ఉచిత బ‌స్సు..మ‌హిళ‌ల‌ను సంబుర‌ప‌రిచింది!

మ‌న ఈనాడుః కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హ‌మీల‌లో భాగంగా శ‌నివారం సోనియాగాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా పుర‌స్క‌రించుకుని రెండు గ్యారంటీల‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మ‌ల్లాపూర్ డివిజ‌న్ కాంగ్రెస్ నాయ‌కులు నెమ‌లి అనీల్ త‌న స‌తీమ‌ణి లిఖిత‌తో ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్ధానాల్లో భాగంగా నేటి నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం అందుబాటులోకి తీసుక‌రావ‌డం జ‌రిగింద‌ని మ‌హిళా ప్ర‌యాణికుల‌కు ప్ర‌చారం చేశారు. అంతేగాకుండా నేటి నుంచి రూ.10ల‌క్ష‌ల ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కూడా అందుబాటులోకి తీసుక‌రావ‌డం జ‌రిగింద‌న్నారు.

100రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తాన‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ప్ర‌జాద‌ర్భార్ ద్వారా ప్ర‌జాభ‌వ‌న్‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నేరుగా తెలుసుకోని ప‌రిష్కారానికి బాటలు వేస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు మెచ్చిన పాల‌న కోసం సీఎం రేవంత్‌రెడ్డి సుస్థిరపాల‌న అందిస్తార‌ని తెలిపారు.

 

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *