
నిజాం కాలం నాటి ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital).. సరికొత్త నయా హాస్పిటల్గా మారబోతుంది. అంతర్జాతీయ సొబగులతో.. అధునాతన హంగులతో.. కొత్త ఆస్పత్రి నిర్మించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు(Medical services) అందించడమే లక్ష్యంగా ఉస్మానియా ఆసుపత్రిని సరికొత్త(Osmania New Hospital)గా నిర్మించబోతోంది తెలంగాణ గవర్నమెంట్(Telangana Govt). ఈ రోజు ఉదయం 11:55 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇతర అధికారులు హాజరుకానున్నారు.
అత్యాధునిక హంగులతో.. కార్పొరేట్ స్థాయిలో..
ఉస్మానియా ఆసుపత్రి దశాబ్దాలుగా తెలంగాణ, AP, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రజలకు వైద్య సేవలందిస్తోంది. ప్రస్తుతం అఫ్జల్గంజ్లో ఉన్న ఆసుపత్రి బదులుగా గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో 26 ఎకరాల్లో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించబోతున్నారు. 2,000 పడకల సామర్థ్యంతో, కార్పొరేట్ స్థాయిలో ఉండేలా ఆసుపత్రిని నిర్మించనుంది. సర్కార్ ప్రతిపాదించిన లే అవుట్ ప్రకారం.. మొత్తం 8 గేట్లు ఉండబోతున్నాయి. ఇందులో మూడువైపుల నుంచి ఆస్పత్రిలోకి ఎంటర్ అయ్యేలా మూడు గేట్లు ఉంటాయి. ఇవికాకుండా.. సర్వీస్ గేట్, మార్చురీ గేట్, హాస్టల్ గేట్, హాస్టల్&అకడమిక్ గేట్, అకడమిక్ గేట్ సపరేట్గా ఉన్నాయి.
రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు
అంతేకాదు.. 2500 కోట్లతో 14 అంతస్తుల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్(World class facilities)తో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్త ఉస్మానియా ఆస్పత్రిని 30 డిపార్ట్మెంట్లు, నర్సింగ్(Nursing), డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలతో పాటు 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం(A huge auditorium) నిర్మించనున్నారు. జీ+12గా బాయ్స్ హాస్టల్, ఫ్యాకల్టీ రెసిడెన్షి, గర్ల్స్ హాస్టల్ కూడా హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉండేలా డిజైన్ చేశారు. రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించనున్నట్లు CM రేవంత్ ఇటీవల జరిపిన సమీక్షలో తెలిపారు. దీంతో పేదలకు, మధ్యతరగతి వారికి వైద్యసేవలు మరింత సులభం కానున్నాయి.