Earthquake: తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు

తెలంగాణ(Telangana) ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. కరీంనగర్(Karimnagar), రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. అటు నిర్మల్(Nirmal District) జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Saraswati Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పష్కరాలు

నేటి నుంచి ఈ నెల 26 వరకూ తెలంగాణ(Telangana)లో సరస్వతి నది పుష్కరాలు(Saraswati Pushkaralu) నేటి జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleshwaram)లో జరిగే ఈ పుష్కరాల కోసం సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *