Education: ఒత్తిడిని ఎదుర్కోవాలని విద్యార్థులకు చెప్పండి!

మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులను తీసుకువస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తాజాగా వెల్లడించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులను తీసుకువస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో రకరకాల రూపాల్లో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని, వాటిని తట్టుకునేందుకు చిన్నప్పటి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దేలా ‘చెలిమి’ కార్యక్రమాన్ని, వారిలో వ్యాపార దృక్ఫథాన్ని పెంచడంతో పాటు వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేలా ‘అంకురం’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు ఆమె ప్రకటించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ టి. అనిత హరినాథ్‌రెడ్డి, విద్య-మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్‌ ఆర్‌. శ్రీధర్‌ రెడ్డి తదితరులు బ్రోచర్‌లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల గురించి మంత్రి వివరించారు.

‘‘పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా చదువులను అభ్యసిస్తేనే జాతి నిర్మాణంలో విద్యార్థులు నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలరని ప్రభుత్వం భావిస్తోంది. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తి పిల్లల్లో పెరుగుతుంది. వేగంగా పురోగమిస్తున్న ప్రపంచంలో విద్యార్థి తనకు తానుగా సమాయత్తమయ్యేలా, నైపుణ్యాలు నేర్చుకొనేలా వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఇందుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుండి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలలో చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇక అంకురం కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి అమలుచేస్తున్నాం. ఈ రెండు కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, ఉదయం శిక్ష, ఓక్‌నార్త్‌ ఇండియా, ఇంక్విలాబ్‌ ఫౌండేషన్‌, వై హబ్‌ సహకారంతో రూపకల్పన చేశాం. వచ్చే విద్యాసంవత్సరానికల్లామరిన్ని పాఠశాలలకు విస్తరిస్తాం’’ అని మంత్రి స్పష్టం చేశారు.

  • Related Posts

    TG SSC: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ప్రీఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

    తెలంగాణ(Telangana)లోని పదో తరగతి విద్యార్థుల(10th Class Students)కు అలర్ట్. టెన్త్ క్లాస్ విద్యార్థుల‌కు ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల(Pre Final Examinations) తేదీల‌ను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను గురువారం…

    ప్రశాంతంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్స్

    దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ (JEE Main) పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎగ్జామ్ మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. మళ్లీ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *