విజయవాడ ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.  సితార సెంటర్‌లో విద్యాధరపురం గ్రౌండ్‌లో కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

భారీగా ఎగిసిపడ్డ మంటలు

మొత్తం మూడు అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఎగ్జిబిషన్‌లోని ఒక స్టాళ్లలో వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌ పేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో మంటలు వ్యాపించి పక్కనున్న స్టాళ్లకు అంటుకున్నాయని వెల్లడించారు.

స్టాళ్లు దగ్ధం

కశ్మీర్‌ జలకన్య పేరుతో గత కొన్ని రోజులుగా విజయవాడలో ఎగ్జిబిషన్‌లో కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో స్టాళ్లు.. ఫర్నిచర్‌ దహనమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా లేదా తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు మాత్రం తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

SLBC టన్నెల్​ అప్​డేట్.. ఆ ప్రాంతంలో మరో డెడ్ బాడీ లభ్యం

నాగర్​కర్నూల్ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ వద్ద సొరంగం కూలిన ఘటన (SLBC Tunnel Collapse)లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది సిబ్బంది చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఇప్పటికే ఒకరి మృతదేహం లభించింది. మరో…

షిహాన్ హుసైనీ కన్నుమూత.. గురువును తలుచుకుంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్

పవర్ స్టార్ పవన్​ కళ్యాణ్​ (Pawan Kalyan) గురువు, కోలీవుడ్‌ నటుడు షిహాన్‌ హుసైనీ (60) కన్నుమూశారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చైన్నైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *