iPhone 17: మొబైల్ లవర్స్ అదిరిపోయే న్యూస్.. బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ

భారత్‌(India)లో యాపిల్ కంపెనీ(Apple Company) తన ఐఫోన్(iPhone) ఉత్పత్తిని విస్తరించే దిశగా మరో ముందడుగు వేసింది. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్(Foxconn) బెంగళూరులోని దేవనహళ్లిలో తన కొత్త ఫ్యాక్టరీలో ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ యూనిట్, ఫాక్స్‌కాన్‌కు చెందిన చైనా బయట రెండవ అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రం(iPhone Manufacturing Center)గా నిలిచింది. దాదాపు 2.8 బిలియన్ డాలర్ల (సుమారు 25,000 కోట్ల రూపాయలు) పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఈ కర్మాగారం చెన్నైలోని ఫాక్స్‌కాన్ యూనిట్‌తో కలిసి ఐఫోన్ 17 ఉత్పత్తిని చేపట్టనుంది.

60 మిలియన్ ఐఫోన్‌ల ఉత్పత్తే లక్ష్యం

ఈ కొత్త యూనిట్ ప్రారంభం, భారత్‌ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌(Apple’s global supply chain)లో కీలక హబ్‌గా మార్చే లక్ష్యంతో ఏర్పడింది. 2025లో యాపిల్ 60 మిలియన్ ఐఫోన్‌ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2024-25లో 35-40 మిలియన్ యూనిట్ల నుంచి గణనీయమైన పెరుగుదల. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో యాపిల్ 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను అసెంబుల్ చేసింది. ఇది 60% వృద్ధిని సూచిస్తుంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్(Apple CEO Tim Cook), జూలై 31, 2025న ఆర్థిక ఫలితాల ప్రకటనలో జూన్ 2025లో అమెరికాలో విక్రయించిన ఐఫోన్‌లలో ఎక్కువ భాగం భారత్‌లో తయారైనవని పేర్కొన్నారు.

సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదలకు ప్లాన్

ఈ యూనిట్ ప్రారంభంతో, భారత్‌లో ఐఫోన్ ఎగుమతులు మరింత పెరగనున్నాయి. అంతేకాకుండా, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌(Indian smartphone market)లో యాపిల్ వాటా 7.5%కి చేరింది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌ వద్ద ఏర్పాటు చేసిన యూనిట్‌లోనూ ఫాక్స్‌కాన్‌ ఐఫోన్‌ 17ను అసెంబ్లింగ్‌ చేస్తోంది. ఐఫోన్‌ 17ను యాపిల్‌ సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *