
దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు బుధవారం కాస్త తగ్గుముఖం పట్టి మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర బుధవారం రోజున రూ.88,660 ఉండగా, గురువారం నాటికి రూ.140 పెరిగింది. ఇవాళ పసిడి ధర రూ.88,800 వద్ద పలుకుతోంది. బుధవారం నాడు రూ.97,192 ఉన్న కిలో వెండి ధర గురువారం నాటికి రూ.408 పెరిగి రూ.97,600కు చేరుకుంది.
మళ్లీ పెరిగిన ధరలు
తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి, వెండి ధరలు (Silver Price Today) రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్, ప్రొద్దుటూరు. విజయవాడ, విశాఖపట్నంలో పుత్తడి, వెండి ధరలు పెరగడంతో ఆభరణాలు విక్రయించేందుకు మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు. శుభకార్యాలు ఉండటంతో బంగారం కొనుగోలు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.88,800.. కిలో వెండి ధర రూ.97,600
- విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.88,800.. రూ.97,600
- విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.88,800.. కిలో వెండి ధర రూ.97,600
- ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.88,800.. కిలో వెండి ధర రూ.97,600గా ఉంది.