
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Tirumala Vankateshwara Swamy Temple) వారి దర్శనానికి భక్తులు(Devotees) పోటెత్తారు. వీకెండ్కు తోడు వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. పిల్లాపాపలతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. ఇవాళ (ఏప్రిల్ 26) ఉదయం 11 గంటల వరకూ 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని TTD అధికారులు తెలిపారు. మరోవైపు అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి.
రద్దీ ప్రదేశాల్లో పటిష్ఠ భద్రత
కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, రూ.300 స్పెషల్ దర్శనాని(Special Entry Darshan)కి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా శుక్రవారం 64,536 మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు TTD తెలిపింది. మొక్కుల రూపంలో భక్తులు రూ.3.37 కోట్లు హుండీ(Hundi)లో స్వామి వారికి సమర్పించుకున్నారని వెల్లడించింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో తిరుమల తిరుపతిలో భారీగా పోలీసులు మోహరించారు. ఉగ్రకదలికలు ఉన్నాయన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఆదేశాల మేరకు పోలీసులు ప్రతిచోటా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.