మన ఈనాడు: మధుమేహం పట్ల రోగులు ఆందోళన వీడటంతో వైద్యుల సలహాలు, సూచనలతో తరమికోట్టొచ్చునని ఆరంజ్​ ఆసుపత్రి వైద్యులు డా.గౌతం, డా.క్రాంతి, సుస్మితలు పేర్కొన్నారు. ఎల్బీనగర్​ ఆరంజ్​ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ వేడుకలను న్యూట్రిషన్​ ప్రవళిక ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యాధి లక్షణాలను గుర్తించడంతోపాటు సకాలంలో వైద్యులు సూచనలతో చికిత్స తీసుకోవడంతో మధుమేహం నివారించవచ్చునని తెలిపారు. చికిత్సపాటు ఆహర అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు సూచించారు. మధుమేహ వ్యాధి లక్షణాలు నివారణ గురించి విద్యార్థులకు తెలియజేశారు. మధుమేహం వచ్చిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. మధుమేహ లక్షణాల గురించి పోస్టర్ ద్వారా ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు. 100 మంది న్యూట్రిషన్ విద్యార్థులు వీక్షించారు. వ్యాది బారీన పడిన రోగులు ఆందోళన చెందకుండా ఎల్బీనగర్​లోని ఆరంజ్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని కోరారు.