మన ఈనాడు:
ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అన్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ MLA అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం చేస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు.
సీఎం కేసీఆర్(KCR) అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్దిదారులే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు పెద్ద బలంగా మారుతుందని పేర్కొన్నారు. మరో వందేళ్ల అభివృద్ధి సాధించాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉందని పిలుపునిచ్చారు.
బీఎల్ఆర్ గెలుపుకోసం ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలే స్వచ్చంధంగా వచ్చి ప్రచారం చేస్తున్నారని, అత్యధిక మెజార్టీ సాధించి గ్రేటర్లో ఉప్పల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. పనులను వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ, న్యూ భవాని నగర్ కాలనీల్లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు ఇంటింటికి వెళ్లి BRS పార్టీ సంక్షేమ పథకాలు, స్థానిక కాలనీ అభివృద్ధి పనుల తెలుపుతూ ప్రచారం చేశారు.