మన ఈనాడు: కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించే దిశగా ప్రతి కార్యకర్త మూడు రంగుల జెండా ఊపిరిగా పనిచేశారని వారికి తగిన గుర్తింపు వస్తోందని ఆపార్టీ ఉప్పల్ ఇంఛార్జీ మందముల పరమేశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాగంగా మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్లో బీబ్లాక్ పరిధిలోని నాయకులతో సమావేశం అయ్యారు.
ఎన్నికల హామీలలో భాగంగా ఆరు గ్యారంటీల అమలు చేస్తామని వాగ్ధానం చేశాం. అధికారం సాధించిన రెండురోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ప్రజల్లోకి కాంగ్రెస్ సర్కారు అమలు చేసిన రెండు పథకాలు విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్ట:సుఖాలు తెలుసుకుంటూనే జనం సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు కీలకంగా పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ , రాఘవ రెడ్డి , అంజిరెడ్డి , సీతారాం రెడ్డి , కృష్ణ రెడ్డి , జలగం వెంకటేష్ , రాజేందర్ , నెమలి అనిల్ కుమార్, పత్తి కుమార్ ,అంజయ్య ,యాదగిరి,సుదర్శన్,
సద్గుణ ,గట్టయ్య ,రాజేష్ , సాయి గౌడ్ , బాలరాజ్ గౌడ్ , రాజు గౌడ్ ,కిట్టు , శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు