
భారతదేశం-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల(India-Pakistan Tensions)ను ఆ దేశం మరింత పెంచుతోందని భారత ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై శనివారం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను మీడియా ముందు వివరించింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ(Foreign Ministry Spokesperson Vikram Misri), కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Wing Commander Vyomika Singh) పాల్గొన్నారు.
అది నిజంగా ప్రమాదకర చర్యే..
ఈ క్రమంలో కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పాక్ సైన్యం(Pak Army) భారత సరిహద్దుల(Indian borders) వైపు కదులుతోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని ఆరోపించారు. పాక్ బలగాలు సరిహద్దులవైపు కదలడం కచ్చితంగా ప్రమాదకరమైన చర్యేనని స్పష్టం చేశారు. పంజాబ్(Punjab)లోని వాయుసేన స్థావరాలపై ఈరోజు తెల్లవారుజామున హైస్పీడ్ మిసైళ్ల(High-speed missiles)తో పాక్ దాడులు చేసిందని తెలిపారు.
Colonel Sofia Qureshi should be heard 👇
Full details of what happened between India and Pakistan last night have been given
#IndiaPakistanConflict#IndianArmy #IMFSupportsTerrorists #HinduDharmKiMahima #DroneAttacks #WayVinMexico #IndiaPakistanWarpic.twitter.com/BgoHKwfO8w
— INDO PAK WAR 🇮🇳 (@INDOPAK_WAR) May 10, 2025
పాక్ దాడులను తిప్పికొడుతున్నాం..
కాగా పాక్ రేంజర్లు శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్లలోని వైద్య కేంద్రాల(Health Centres)పై దాడి చేశారని చెప్పారు. ఇది ముమ్మాటికీ భారత్ను రెచ్చగొట్టే చర్యేనని తెలిపారు. భారత మిలిటరీ స్థావరాల(Indian military bases)పై పాక్ చేస్తున్న దాడులను మన సైన్యం తిప్పికొట్టిందని వివరించారు. పాక్ దాడులకు ప్రతస్పందిస్తూ ఆ దేశంలోని మిలటరీ స్థావరాలు, రాడార్లు(Radars), కమాండ్ కంట్రోల్ సెంటర్ల(Command control centers)పై భారత్ దాడి చేసిందని ఖురేషీ వివరించారు.