Operation Sindoor: పాక్ రాడార్ కేంద్రం, ఏవియేషన్ బేస్ ధ్వంసం చేశాం: కల్నల్ ఖురేషీ

భారతదేశం-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల(India-Pakistan Tensions)ను ఆ దేశం మరింత పెంచుతోందని భారత ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై శనివారం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను మీడియా ముందు వివరించింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ(Foreign Ministry Spokesperson Vikram Misri), కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Wing Commander Vyomika Singh) పాల్గొన్నారు.

అది నిజంగా ప్రమాదకర చర్యే..

ఈ క్రమంలో కల్నల్‌ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పాక్ సైన్యం(Pak Army) భారత సరిహద్దుల(Indian borders) వైపు కదులుతోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని ఆరోపించారు. పాక్ బలగాలు సరిహద్దులవైపు కదలడం కచ్చితంగా ప్రమాదకరమైన చర్యేనని స్పష్టం చేశారు. పంజాబ్‌(Punjab)లోని వాయుసేన స్థావరాలపై ఈరోజు తెల్లవారుజామున హైస్పీడ్ మిసైళ్ల(High-speed missiles)తో పాక్ దాడులు చేసిందని తెలిపారు.

పాక్ దాడులను తిప్పికొడుతున్నాం..

కాగా పాక్ రేంజర్లు శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్‌లలోని వైద్య కేంద్రాల(Health Centres)పై దాడి చేశారని చెప్పారు. ఇది ముమ్మాటికీ భారత్‌ను రెచ్చగొట్టే చర్యేనని తెలిపారు. భారత మిలిటరీ స్థావరాల(Indian military bases)పై పాక్ చేస్తున్న దాడులను మన సైన్యం తిప్పికొట్టిందని వివరించారు. పాక్ దాడులకు ప్రతస్పందిస్తూ ఆ దేశంలోని మిలటరీ స్థావరాలు, రాడార్లు(Radars), కమాండ్ కంట్రోల్ సెంటర్ల(Command control centers)పై భారత్ దాడి చేసిందని ఖురేషీ వివరించారు.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *