డబ్బు సంపాదిస్తేనే సరిపోదు.. ఈ సూత్రాలు పాటించాలి

ManaEnadu:డబ్బులు ఊరికే రావు అని ఓ పెద్దాయన అన్నట్టు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. డబ్బు పొదుపు(Money Savings) చేయడం సంపాదించడంతో సమానం అని కొందరంటే, సంపాదించిన డబ్బును రెండింతలు చేయడం మంచిదని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా డబ్బు సంపాదించగానే సరిపోదని, ఓ క్రమ పద్ధతిలో ఖర్చు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యూచర్‌(Future) కోసం సక్రమంగా పెట్టుబడులు పెట్టాలని, ఈ క్రమంలో కొన్ని సూత్రాలు తప్పక పాటించాలని చెబుతున్నారు. మరి ఆ సూత్రాలేంటంటే?

క్రెడిట్ కార్డ్ లిమిట్ 

చాలా మంది ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు(Credit card)తీసుకుంటున్నారు. విపరీతంగా వాడేస్తున్నారు. నెలాఖరును బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అందుకే క్రెడిట్‌ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. అంటే మీ కార్డు లిమిట్ లక్ష రూపాయలు ఉంటే నెలలో రూ.30వేలకు మించి కార్డు వాడకుండా జాగ్రత్త తీసుకోవాలి.

జీతంలో 15% ఇన్వెస్ట్ చేయాలి :

మీ జీతం/ఆదాయంలో కనీసం 10 నుంచి 15 శాతం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్(Invest) చేయాలి. మీ శాలరీ రూ.60 వేలు ఉందనుకోండి అందులో 15 శాతం అంటే రూ.9వేలు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలన్నమాట.

జీతంలో 70% :

మీకు ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో కనీసం 70 శాతం పదవీ విరమణ(Retirment) తర్వాత వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రస్తుతం మీ జీతం లక్ష రూపాయలు అనుకుంటే రిటైర్మెంట్ తర్వాత మీకు రూ.70వేలు ఆదాయం ఉండాలన్నమాట. అలా అయితేనే నేటి జీవనశైలిలో బతకగలం.

10 శాతం మించొద్దు: 

మీరు షేర్స్, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారా. అయితే మీ మొత్తం పెట్టుబడిలో 10 శాతానికి మించి ఒకే షేర్‌లో పెట్టొద్దు. మీ పెట్టుబడి రూ.10 లక్షలు ఉంటే ఒకే షేర్ లేదా ఒకే ఫండ్‌లో రూ. లక్షకు మించి ఉండొద్దన్నమాట.

24 గంటలు ఎదురుచూడాలి :

చాలా మంది షాపింగ్‌(షాపింగ్) వెళ్లినప్పుడు కంటికి ఏది కనిపిస్తే అది కొనేస్తుంటారు. అది అవసరమో కాదో కూడా చూసుకోరు. ఆ తర్వాత డబ్బంతా ఖర్చు చేశామని బోరుమంటారు. అందుకే ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నప్పుడు కనీసం 24 గంటలు ఎదురుచూడాలి. ఆ తర్వాతే కొనాలా వద్దా అని నిర్ణయించుకోవాలి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *