Keerthi Suresh: పెళ్లి తర్వాత బిజీ షెడ్యూల్.. ఇంకో రెండేళ్లపాటు ఇక్కడే!

మహానటి సినిమాతో ఒక్కసారిగా సినీ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న నటి కీర్తి సురేష్(Keerthi Suresh). తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి. తాజాగా ఆమె ఓ ఆసక్తికరమైన చిత్రంలో నటిస్తోంది. ‘ఉప్పు కప్పురంబు (Uppu Kappurambu)’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా, నటుడు సుహాస్ హీరోగా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా జులై(July) 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

పెళ్లి తర్వాత కొంతకాలం కెరీర్‌కు విరామం ఇచ్చిన నటి కీర్తి సురేశ్‌ మళ్లీ ఫుల్‌ స్పీడ్లో ఉంది. తాజాగా ఆమె కోలీవుడ్‌లో రెండు సినిమాలకు ఒప్పుకాగా, టాలీవుడ్‌లోనూ రెండు ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ రెండు తెలుగు చిత్రాలు నిర్మాత దిల్‌రాజు(Dil Raju) బ్యానర్‌లో తెరకెక్కనున్నవే కావడం విశేషం.

వాటిలో ఒకటి విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)తో నటిస్తున్న ‘రౌడీ జనార్దన్'(Roudy Janardan). రవికిరణ్‌ కోలా(Ravi kiran Kola) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంతో సాగే యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. కీర్తి సురేశ్‌, విజయ్‌ దేవరకొండలు ‘మహానటి’లో కలిసి నటించినా.. వారి మధ్య కాంబినేషన్‌ సీన్లు లేకపోవడంతో, ఈ సినిమా వారిద్దరి తొలి కాంబినేషన్‌ గా నిలవనుంది.

మరోవైపు, నితిన్‌ హీరో(Nithin)గా వేణు యెల్దెండి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఎల్లమ్మ'(Ellamma). బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘బలగం’ తర్వాత వేణు చేస్తున్న ఈ చిత్రం ఆధ్యాత్మికత, సంప్రదాయ కళల ఉంటుందని సమాచారం. ఈ రెండు చిత్రాల కోసమే కీర్తి సురేశ్‌ వరుసగా రెండేళ్లపాటు డేట్స్‌ కేటాయించినట్లు టాలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *