
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు (JEE Main 2025 Results) విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్కు చెందిన బనిబ్రత మాజీ, వంగల అజయ్ రెడ్డి 300కి 300 మార్కులు పొంది జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. మరోవైపుఈ ఫలితాల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా విద్యార్థులు కూడా సత్తా చాటారు. . ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ ర్యాంకుకు 93.102 పర్సంటైల్గా నిర్ణయించారు.
జేఈఈలో సత్తా చాటిన ఖమ్మం
ఇక జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో ఖమ్మంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల (SR Junior College Khammam) విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజీ ఛైర్మన్ వరదారెడ్డి అభినందించారు. కళాశాల స్థాపించినప్పటి నుంచి నేటి వరకు ప్రతి పోటీ పరీక్షలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మంచిర్యాంకులు సాధించడం అభినందనీయం అని ఛైర్మన్ అన్నారు.

అందరికీ అభినందనలు
ఇంతటి ఘన విజయానికి కారణం పటిష్టమైన ప్రణాళిక, సీనియర్ అధ్యాపక బృందం, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల కృషి అని ఛైర్మన్ వారందరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి, డీజీఎం గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇంచార్జ్ విజయ భాస్కర్ రెడ్డి గారు, డీన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్స్ అశోక్, శ్రీనివాస్, సుధాకర్, బ్రహ్మం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.
ర్యాంకులు సాధించిన విద్యార్థులు వీరే
వినోద్-246, వెంకట్ చరణ్-1047, ఆకాష్ -1813, పవన్ కుమా ర్-1185,సాయి పవన్ 3248,అఖిల-3828, శివ సాయి-4721, సాయి చరణ్ -6200, భరత్ -6839,వాసు-6876, శ్రీలేఖ-7505, శశాంక్-8151, రవితేజ-8387, తీర్ధన-9434, నవీన్ కుమార్-9698,మోహిత్-9810, సంతోష్-9972,