‘డీలిమిటేషన్’ ఇష్యూ.. నేడు దక్షిణాది రాష్ట్రాల నేతల భేటీ

డీలిమిటేషన్(Delimitation) అంశంపై దక్షిణాది రాష్ట్రాల నేతలు నేడు భేటీ కానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(Tamil Nadu CM MK Stalin) అధ్వర్యంలో చెన్నై(Chennai)లో ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth), BRS నేత KTRతో పాటు 7 రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమావేశం లక్ష్యం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు ఎదురయ్యే సవాళ్లను చర్చించడం, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం. ఇప్పటికే ఈ భేటీ కోసం తెలంగాణ సీఎం రేవంత్ చెన్నైకి చేరుకున్నారు.

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన

ఈ సమావేశంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్ర ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య(Number of constituencies)ను పెంచడం వల్ల ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

DMK MPs stage a protest on the issue of delimitation, at Parliament House premises in New Delhi on Thursday. (ANI PHOTO)

రేవంత్ రెడ్డి, స్టాలిన్ మధ్య ప్రాథమిక చర్చలు

సమావేశానికి ముందు రేవంత్ రెడ్డి, స్టాలిన్ మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయనీ, ఈ అంశంపై కాంగ్రెస్, డీఎంకేలు ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నాయని సమాచారం. కేటీఆర్ హాజరవడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. BRS ఈ విషయంలో దక్షిణ రాష్ట్రాలతో కలిసి నడవాలని భావిస్తోంది. ఈ సమావేశంలో రాజ్యసభ(Rajyasabha), లోక్‌సభ(Loksabha) స్థానాల సంఖ్యపై జనాభా ఆధారిత డీలిమిటేషన్ ప్రభావం, దాన్ని ఎదుర్కోవడానికి చట్టపరమైన, రాజకీయ చర్యలపై చర్చ జరగనుంది. ఈ సమావేశం దక్షిణ భారత రాష్ట్రాల ఐక్యతను చాటే అవకాశంగా భావిస్తున్నారు.

Tamil Nadu's MK Stalin Raises Stakes Over Delimitation, Calls 7 State Leaders To Chennai

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *