Maha Kumbh: మహా కుంభమేళా.. 50కోట్లకుపైగా భక్తుల పుణ్యస్నానాలు

ప్రపంచంలోనే అత్యంత వైభవంగా కొనసాగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా(Kumbh Mela 2025). 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు(Devotees) తరలివస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 26తో ముగియనుంది. కాగా త్రివేణీ సంగమంలో ఇప్పటి వరకూ వచ్చిన భక్తుల సంఖ్య 50కోట్లు దాటిందని యూపీ సర్కార్ వెల్లడించింది. ఇది భారత్(India), చైనా(Chaina) మినహా మిగిలిన ప్రపంచ దేశాల జనాభాను దాటేసినట్లుగా పేర్కొంది.

మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది రాక

కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య అమెరికా(USA), రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఎక్కువ అని తెలిపింది. శుక్రవారం సాయంత్రానికి ప్రయాగ్‌రాజ్(Prayagraj) వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే జనవరి 29న మౌని అమావాస్య(Mouni Amavasya) రోజు దాదాపు 8 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

Mahakumbh 2025: महाकुंभ में रास्ता दिखा रहा 50 हजार QR कोड, डूबकी लगाने  वालों पर है 300 गोताखोरों की नजर

60 కోట్లకుపైగా వచ్చే అవకాశం

కాగా కుంభమేళా(Kumbhamela)కు 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. కానీ మరో 11 రోజులు ఉండగానే భక్తుల సంఖ్య 50 కోట్లను దాటింది. దీంతో ఈ సంఖ్య 60 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని UP సర్కార్ అంచనా వేస్తోంది. ఇదిలా ఉండగా, కుంభమేళా విషయమై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అసత్య సమాచారం, తప్పుదోవ పట్టించే వీడియోలు(Videos) వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *