నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ

నిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీపికబురు అందించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (AP Mega DSC) ఉంటుందని ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. పాఠశాలల ప్రారంభం నాటికి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

కలెక్టర్లు దర్పం ప్రదర్శించొద్దు

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందన్న ముఖ్యమంత్రి.. కొందరు అభివృద్ధి చేస్తే.. మరికొందరు నాశనం చేస్తారని వ్యాఖ్యానించారు.

ప్రజలకు హామీ ఇచ్చాం

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని కలెక్టర్లతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానం అని తెలిపారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని వ్యాఖ్యానించారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Related Posts

Srisailam Reservoir: కృష్ణమ్మకు ఏపీ సీఎం జలహారతి.. నేడు తెరుచుకోనున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు

శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల(Heavy Rains) వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద(flood) నీరు వచ్చి చేరుతోంది. సుంకేసుల(Sunkesula), జూరాల(Jurala) నుంచి 1,72,705 క్యూసెక్కుల నీటి ప్రవాహం…

SCR: ప్రయాణికులకు ఊరట.. 48 స్పెషల్ ట్రైన్స్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త అందించింది. ఇటీవల రైళ్ల రద్దు, దారి మళ్లింపు, స్టేషన్ల పునర్మిణానం, మూడో లైన్ పనులు, ఇతర స్టేషన్లనుంచి రాకపోకలు అంటూ ప్రయాణికులను(Passengers) విసిగించిన రైల్వే శాఖ(Railway Department) తాజాగా ప్రయాణికులకు కాస్త…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *