MS Dhoni: శాంటాక్లాజ్​గా ధోనీ.. ఫొటోలు చూశారా?

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas) వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భారత్​లోనూ చర్చిలు, ఇండ్లలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెలబ్రిటీలు సైతం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కూడా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంబరాలు జరుపుకున్నాడు. భార్య సాక్షి, కూతురు జీవా, బాలీవుడ్ నటి కృతిసనన్, కభీర్ బహియా తదితరులు పాల్గొన్న ఈ సెలబ్రేషన్స్​లో.. ధోనీ (Dhoni) శాంటాక్లాజ్ (santa claus) వేషధారణలో సందడి చేశాడు. మిగతా వాళ్లు శాంటాక్లాజ్​టోపీలు ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సాక్షి సోషల్ మీడియాలో షేర్​చేసింది. వాటిని చూసిన ధోనీ ఫ్యాన్స్..​శాంతాక్లాజ్ గెటప్​లో తమ అభిమాన క్రికెటర్​సందడి చేయడం చూసి ఖుష్​అవుతున్నారు.

2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్​లో (IPL) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడుతున్నాడు. రోహిత్ శర్మ తర్వాత ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీ. ఐపీఎల్ 2025 కోసం గత నెలలో నిర్వహించిన వేలంలో చెన్నై సూపర్​కింగ్స్ రిటైన్ చేసుకున్న ఐదుగురు ఆటగాళ్లలో ధోనీ ఒకరు.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *