ఇలాంటి సినిమా ఎన్నడూ రాలేదు.. SSMB29పై కీరవాణి క్రేజీ అప్డేట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో వస్తున్న SSMB29 మూవీ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రబృందం ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల చూపంతా ఈ సినిమాపైనే. నెటిజన్లు వేయి కళ్లతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Image

SSMB29పై కీరవాణి అప్డేట్

ఈ చిత్రం గురించి చిన్న అప్డేట్ వినిపించినా సరే మహేశ్ బాబు అభిమానులు నెట్టింట దాన్ని తెగ వైరల్ చేసేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడినా అందరూ ఆవైపే చూస్తున్నారు. దాని గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ షేర్ చేసుకున్నారు.  ‘నా టూర్ ఎంఎంకే (Na Tour MMK)’ అనే ఈవెంట్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ టూర్ కోసం కీరవాణి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా మహేశ్ బాబు, జక్కన్న సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ పంచుకున్నారు.

ఇలాంటి సినిమా రాలేదు

SSMB29 లాంటి సినిమా ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నడూ రాలేదంటూ కీరవాణి (Keeravani On SSMB29) ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశారు. చాలా క్లిష్టమైన కథతో కఠినమైన ప్రాజెక్టుతో మహేశ్, రాజమౌళి ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు వస్తున్నారని తెలిపారు. ఎన్నో సినిమాలకు పని చేసిన తనకు ఈ మూవీకి పని చేయం మాత్రం ఛాలెంజింగ్ మారిందని వెల్లడించారు. ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదు కాబట్టి కొత్త ట్యూన్స్, మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నట్లు వివరించారు. రాజమౌళి మరో అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడంటూ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు కీరవాణి. ఇక ఇప్పుడు కీరవాణి కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *