ప్రణయ్‌ హత్య కేసులో సంచలన తీర్పు.. A2కు ఉరిశిక్ష

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మారుతీ రావు అనే వ్యక్తి 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్ (Pranay Murder Case) ను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో తాజాగా నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్‌ కుమార్‌ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది.

ఆరేళ్ల తర్వాత తీర్పు

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్‌ యంత్రాంగం.. దర్యాప్తు ముమ్మరం చేసి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంది. 2019లో ఛార్జిషీటు దాఖలు చేయగా.. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగింది. ఇక ఇటీవలే వాదనలు ముగియడంతో తాజాగా సోమవారం (మార్చి 10వ తేదీ) నల్గొండ కోర్టు (Nalgonda Court) తుది తీర్పు వెల్లడించింది.

ఏ1 ఆత్మహత్య

ప్రణయ్‌ హత్య కేసులో ఏ1 మారుతీ రావు (Maruthi Rao) (అమృత తండ్రి) 2020లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.  ఇక ఈ కేసులో ఏ2 సుభాష్‌ కుమార్‌ శర్మ, ఏ3 అస్గర్‌ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలకు తాజాగా శిక్ష ఖరారయింది. ఏ2కు ఉరిశిక్ష.. మిగతావారికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కేసులో సుభాష్ శర్మ, అస్గర్ అలీ వేర్వేరు జైల్లలో ఉండగా.. మిగిలిన వారంతా బెయిల్ పై బయటకు వచ్చారు.

Related Posts

Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం…

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *