పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా?

రైతులకు గుడ్ న్యూస్.  అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ అమలు చేస్తున్న పీఎం-కిసాన్‌ (PM Kisan) 19వ విడత నిధులు విడుదలయ్యాయి. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున 19వ విడత నిధులను ప్రధాని మోదీ (PM Modi) విడుదల చేశారు.  తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు మోదీ తెలిపారు.

19వ విడత నిధులు విడుదల

‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం కింద అన్నదాతలకు ఏటా ఒక్కో విడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం రూ.6వేల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.  2019 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా.. ఇప్పటివరకు 18 వాయిదాల్లో 11 కోట్లమంది రైతులకు రూ.3.46లక్షల కోట్లు అందజేసింది.  తాజాగా 19వ విడత నిధుల (PM Kisan 19th installment))ను ప్రధాన మంత్రి విడుదల చేశారు.

పీఎం కిసాన్ స్టేటస్ తెలుసుకోవాలంటే?

మరి పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమయ్యాయో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అందుకోసం మొదట మీరు పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోవాలి. అందుకోసం https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్‌ చేసుకోవాలి. ఆ వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌/ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *