Ts Elections: స్పీకర్‌గా చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదా… పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తారా?

పూనాటి మోక్షిత

మన ఈనాడు ప్రతినిధి

స్పీకర్‌‌గా పని చేస్తే ఇక ఖేల్ ఖతం. గెలిచే ముచ్చటే లేదు.
ఇది తెలుగునాట బలంగా వినిపించే మాట.

చరిత్ర చూసుకోండి సార్ అంటారు దాన్నో సెంటిమెంటుగా నమ్మేవాళ్లు. రెండు దశాబ్దాలుగా స్పీకర్‌గా పనిచేసిన వారు మళ్లీ గెలిచిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి సెంటిమెంట్లు రాజకీయాల్లో రాజ్యమేలుతూనే ఉంటాయి.

ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మరోసారి అదే చర్చ నడుస్తోంది. ప్రస్తుత తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పరిస్థితి ఏంటి? అనే చర్చ జోరందుకుంది.

ఎన్నికలు వచ్చాయంటే ఇలాంటి సెంటిమెంట్లకు కొదవ ఉండదు.

ఫలానా నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందంటూ, అందుకు ఏవో ఉదాహరణలు చూపిస్తారు. ఫలానా ఊరి పర్యటనకు పోయినోళ్లు గెలవరు అని ఇంకోటి చెబుతారు. ఆ కోవలోది, అంతకంటే బలమైనది, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన నేతలు మరుసటి ఎన్నికల్లో ఓడిపోవడం.

గత రెండు దశాబ్ధాలుగా తెలుగునాట ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.

అసెంబ్లీకి స్పీకర్‌గా పనిచేసిన నాయకులు మరుసటి ఎన్నికల్లో బరిలో నిలవకపోవడమో, లేదా పోటీ చేసినా ఓడిపోవడమో జరుగుతోంది.

అంటే, ఆ తర్వాత శాసనసభలో అడుగు పెట్టడంలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా పనిచేసిన ప్రతిభాభారతి నుంచి మొదలుకుని ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

వచ్చే నెలలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఈ సంప్రదాయం మారుతుందా లేదా చూడాలి.

సిరికొండ మధుసూదనాచారి
తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ ఈయన.

ఆయన 2014లో జరిగిన ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్మేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

టీఆర్ఎస్ తరఫున గెలిచిన మధుసూదనాచారి తెలంగాణ అసెంబ్లీకి మొట్టమొదటి స్పీకర్‌గా నియమితులయ్యారు.

2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోయారు.

తర్వాత 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన్ను ప్రభుత్వం నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

స్పీకర్‌గా పనిచేసిన తర్వాత వెంటనే జరిగిన ఎన్నికల్లో మాత్రం మధుసూదనాచారికి ఓటమి తప్పలేదు.

పోచారం పరిస్థితేంటి?
తెలంగాణలో 2023 నవంబరు ౩౦న ఎన్నికలు జరగబోతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జనవరిలో అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు.

అంతకుముందు 2014లో బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్‌లో వ్యవవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి బాన్సువాడ నుంచి బరిలో నిలిచారు.

స్పీకర్‌గా పోటీ చేస్తే మరుసటి ఎన్నికల్లో ఓడిపోతారనే సంప్రదాయాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ చేస్తారని చెప్పారు మాజీ స్పీకర్, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి.

‘‘ఈసారి స్పీకర్ ఓటమి సంప్రదాయం మారుతుందని భావిస్తున్నా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచి కొత్త రికార్డు నెలకొల్పుతారు’’ అని సురేష్ రెడ్డి అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *