
టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ వివాదం (Manchu Family Controversy) ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నటుడు మంచు మనోజ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. తిరుపతిలో మనోజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భాకరాపేట ఠాణాకు తరలించినట్లు తెలిసింది. కుటుంబంలో నెలకొన్న వివాదంతో ఆయన తండ్రి మంచు మోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే మనోజ్ (Manchu Manoj)ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మీరిక్కడ ఉండటం సేఫ్ కాదు
భాకరాపేట సమీపంలోని ఉర్జా రిసార్టులో మనోజ్ స్టే చేస్తున్నాడు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు మనోజ్ వద్దకు వెళ్లి.. పలు ప్రశ్నలు అడిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకుంటున్నారని ప్రశ్నిస్తూ.. ఇక్కడ సెలబ్రిటీలు సేఫ్ కాదని చెప్పారు. పోలీసులు డ్రామా చేస్తున్నారంటూ.. తాను అక్కడ రెస్ట్ తీసుకుంటే వారికేం ఇబ్బందంటూ ప్రశ్నించాడు మనోజ్. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
🚨BREAKING NEWS 🚨#ManchuManoj in Police Custody!
Case filled by #MohanBabu Concerning Family MattersStay Strong @HeroManoj1 brother
We all are with you❤️pic.twitter.com/nI8AEibJDm— BS 🦅 (@biggscreen_offl) February 18, 2025
నేనేమైనా టెర్రరిస్టా?
“నేనేమైనా టెర్రరిస్టునా.. దొంగనా..? అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు? ‘సీఎం పేరు ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారు..? మీరు నా దగ్గరకు ఎందుకు వచ్చారు? మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను?’ అంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెట్లపై మనోజ్ భీష్మించుకుని కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న సీఐ ఇమ్రాన్ భాషా వచ్చి సర్దిచెప్పడంతో ఆయన ఆందోళన విరమించాడు. తన యూనివర్సిటీ వద్ద మనోజ్ ఏమైనా గొడవ చేస్తాడనే అనుమానంతో మోహన్బాబు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.