జగన్నాథపురం పాఠశాలకు శుద్ధిచేసిన తాగునీరు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు దాతలు శాశ్వత ప్రాతిపదికన శుద్ధిచేసిన తాగునీరు అందించారు. సూర్యప్రకాష్ ఫౌండేషన్ తరఫున చెక్కును అందజేశారు. కీర్తి శేషులు కోలేటి సూర్య ప్రకాష్ రావు 61వ జయంతి సందర్భంగా కోలేటి వివేక్ చౌదరి, సాత్విక్ చౌదరి కలిసి ఈ చెక్కును పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పాఠశాలకు తాగునీరు అందించేందుకు సాయం చేసిన సూర్య ప్రకాష్ ఫౌండేషన్ కు యాజమాన్యం కృతజ్ఞత తెలిపింది.

 

Related Posts

Aghori: లేడీ అఘోరీకి 14 రోజుల రిమాండ్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు

గత కొంతకాలంగా తెలుగురాష్ట్రంలో హల్చల్ చేస్తున్న అఘోరీ నాగసాధు(Aghori Nagasadhu) పోలీసులు నిన్న అరెస్టు(Arrest) చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక పూజల(Special Pooja) పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిందన్న ఆరోపణలతో ఆమెను ఉత్తరప్రదేశ్‌(UP)లో అరెస్టు…

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభం

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక (Hyderabad MLC Election 2025)కు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్ (BRS)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *