హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(MEIL) సలహాదారు పదవికి విశ్రాంత ఐఏఎస్ పి.వి.రమేష్ రాజీనామా చేశారు. ఈమేరకు మంగళవారం ఉదయం ఆ సంస్థ ఎండీ కృష్ణా రెడ్డికి ఆయన రాజీనామా లేఖను పంపారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో పీవీ రమేశ్ సీఐడీకి అప్రూవర్గా మారారన్న ప్రచారాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. బాబు సర్కారులో ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రమేశ్.. ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు చెబితేనే నిధులు మంజూరు చేసినట్టు సీఐడీకి తెలిపినట్లు నివేధికలో పేర్కొన్నారు. అయితే తన వివరణను సీఐడీ తప్పుగా పేర్కొందని తనకూ ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం లేదని రమేశ్ ఇటీవలె ప్రకటించినా.. అధికార పార్టీ చేసిన ప్రచారం ముందు ఆయన మాటలు జనాల్లోకి వెళ్లలేదు. అయితే ఈ కేసు నేపథ్యంలో మెగా సంస్థ నుంచి బయటకు వెళ్లాలని ఎండీ ఆదేశిస్తేనే ఆయన రాజీనామా చేశారన్న ప్రచారమూ జరుగుతుండగా.. దానిపై పీవీ రమేశ్ తనకు తానే వ్యక్తిగతంగా బయటికి వచ్చానని ఎవరూ పొమ్మనలేదని తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు.