
సాధారణంగా అరటిపండ్ల (Banana Price) ధర ఎంత ఉంటుంది. డజన్లలో అమ్ముతారు కాబట్టి డజను ధర మహా అయితే రూ.60 ఉంటుంది. డిమాండు ఎక్కువ ఉన్నప్పుడు ఆ డజను అరటిపండ్ల ధర రూ.80 కు చేరుతుంది. కానీ ఒక్క అరటిపండు ధర రూ.100 అంటే నమ్ముతారా.. మరీ అంత ధరనా అనిపిస్తోంది కదూ. భారత పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యాత్రికుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
అసలేం జరిగిందంటే..?
ఇండియా టూర్ కు హగ్ అనే రష్యన్ (Russian) యాత్రికుడు వచ్చాడు. తాను సాధారణంగా వ్లాగ్స్ చేస్తుంటాడు. అలా వ్లాగ్ చేస్తున్నప్పుడు రోడ్డుపై ఓ తోపుడు బండి వద్దకు వెళ్లాడు. అక్కడికి వెళ్లి అరటిపండ్లు అమ్ముతున్న వ్యక్తిని ఒక అరటి పండు ధర ఎంత అని అడిగాడు. దానికి అతడు రూ.100 అని సమాధానం ఇచ్చాడు. దీంతో హగ్ షాక్ అయ్యాడు.
ఒక్క అరటిపండు రూ.100
అతడు చెప్పింది తాను సరిగ్గా వినలేదేమో అనుకుని హగ్ మరోసారి ధర ఎంత అడిగాడు. అయినా ఆ విక్రయదారుడు రూ.100 అనే చెప్పాడు. తాను అంత ధర చెల్లించలేనంటూ హగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన హైదరాబాద్ లోనే చోటుచేసుకున్నట్లు వీడియోలో చూస్తే తెలుస్తోంది.
View this post on Instagram
పరువు తీశావు కదా బ్రదర్
ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్లు అరటిపండ్ల వ్యాపారిపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇండియా పరువు తీసేశావు కదా అంటూ మండిపడుతున్నారు. మరికొందరేమో.. మన వాళ్లు ఫారిన్ లో అధిక ధరలతో ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసా బ్రదర్.. వాళ్లకు కరెక్టు పంచ్ ఇచ్చాడు మన బనానా బ్రదర్ అంటూ సపోర్టుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ అరటిపండ్ల వ్యవహారం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.