
వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్(Telangana Budget 2025-26)ను కాంగ్రెస్ సర్కార్(Congress Govt) ఇవాళ అసెంబ్లీ(Assembly)లో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ మొత్తం రూ.3.15 లక్షల కోట్లతో బడ్జెట్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆదాయం అంచనాల కన్నా రూ.50 వేల కోట్ల వరకూ తగ్గుదల నమోదయ్యే సూచనలున్నాయి. ఇవాళ (మార్చి 19) ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మండలిలో మంత్రి శ్రీధర్బాబు(Sridhar Babu) 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు.
సీఎం అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
ఇదిలా ఉండగా బడ్జెట్కి ముందు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం(Cabinet meeting) జరుగుతుంది. ఉదయం 9.30కి అసెంబ్లీ కమిటీ హాల్(Assembly Committee Hall)లో జరగనున్న ఈ భేటీలో బడ్జెట్ని ఆమోదిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.15కి డిప్యూటీ సీఎం, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ఈ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అలాగే.. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ని ప్రవేశపెడతారు.
ఈ రంగాలకే అధిక కేటాయింపులు
కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని సమాచారం. కొత్తగా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ఫ్రంట్(Musi Riverfront), ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు విస్తరణ(Expansion of Metro Rail), ప్రాంతీయ వలయ రహదారి, దీనికి అనుసంధానంగా రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివాటికి కూడా బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.