TS Congress: కాంగ్రెస్‌ యాడ్స్‌పై ఈసీ నిషేధం.. న్యాయ పోరాటం చేస్తాం

By Nikki

మన ఈనాడు: ‘తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలను రూపొందించింది. టీవీ ఛానల్స్‌తో పాటు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలను ప్లే చేస్తున్నారు. అయితే ఈ యాడ్స్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యంతంరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఉన్నాయంటూ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది…

‘మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి’ అంటూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎలక్షన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ఎలక్షన్‌ కమిషన్‌ కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన కొన్ని ప్రకటనలపై నిషేధం విధించింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయ పోరాటం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

‘తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలను రూపొందించింది. టీవీ ఛానల్స్‌తో పాటు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలను ప్లే చేస్తున్నారు. అయితే ఈ యాడ్స్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యంతంరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఉన్నాయంటూ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 9 ప్రకటలను రూపొందించగా.. అందులో రెండు యాడ్స్‌పై ఈసీ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇలాంటి ప్రకటనలను టీవీ ఛానెల్స్‌లో ప్లే చేయొద్దు అంటూ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

దీనిపైనే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే, నోటీసు ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రకటలను బ్యాన్ చేయటం సరికాదని వాదిస్తోంది. ఎన్నికల ప్రచారాలను బీఆర్ఎస్ , బీజేపీ కలిసి ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి నిలివేయలని కాంగ్రెస్ మండిపడింది. ఎమ్‌సీఎన్‌సీలో మీడియా సర్టిఫికెట్ ఇచ్చిన ప్రచారాలను ఆపమనటం కాంగ్రెస్‌ పార్టీ తప్పు పడుతోంది. ఓటమి భయంతోనే ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ నాటకాలు ఆడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

Related Posts

కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి? 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను రేవంత్ సర్కార్ న‌ట్టేట ముంచిందని మండిపడ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *