Six Guarantees: ఆరు గ్యారెంటీలపై అప్డేట్..CM కీలక సమాచారం

మన ఈనాడు:ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు.

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీల అమలుపై అప్డేట్ ఇచ్చారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 28నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదిహేను రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల్లో ఆరు గ్యారెంటీల అమలుకు అప్లికేషన్లు, ఇతర గ్రీవెన్స్ను అడ్రస్ చేస్తామన్నారు

కాంగ్రెస్ పీఏసీ సమావేశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ టికెట్ కేటాయింపు, పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం వంటి విషయాలపై ఆయన కామెంట్స్ చేశారు. ఈ రోజు( సమావేశం జరిగిన రోజు నుంచే) అర్హుల ఎంపిక ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు అతి త్వరలో ప్రభుత్వం మార్గదర్శ కాలు విడుదల చేస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. త్వరలోనే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల ఎంపిక జరుగుతుందన్నారు. నాగ్ పూర్ లో ఈనెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలి పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పై అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీ టికెట్లు పీసీసీ ఎమ్మెల్సీలన్నీ అధిష్టానం పరిధిలో ఉన్నాయన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Related Posts

INDvsENG 2nd T20: తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. భారత్‌ను గెలిపించిన తెలుగోడు

చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్‌(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు…

Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించింన కేంద్రం

గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day 2025) పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల(Padma Awards)ను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *