మేడారం ఎఫెక్ట్​..లక్నవరం బంద్​

మన ఈనాడు:తెలంగాణ (telangana) వాసుల కొంగు బంగారమైన మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి లక్నవరం (Laknavaram) సందర్శన నిలిపివేశారు అధికారులు. ఇవాళ్టి నుంచి నుంచి ఫిబ్రవరి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు, పోలీసులు తెలిపారు.

మేడారం మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.

భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ఎక్కువైతే బ్రిడ్జిపై అనూహ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. పర్యాటకులు సహకరించాలని పోలీసులు కోరారు.

మేడారం మహాజాతర (Medaram Jatara) కోసం ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మేడారం ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమలవుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు

Related Posts

Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం అనాసక్తి 

ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం నిర్వహించడానికి కేంద్రం అనాసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే…

West Indies cricket team: ఒలింపిక్స్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అవకాశం ఛాన్స్ దక్కేనా? 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే దానిపై క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఐసీసీని స్పష్టత కోరుతోంది. సాధారణంగా, వెస్టిండీస్ క్రికెట్ లో 15 దేశాలు లేదా ప్రాంతాల సమాహారంగా ఉంటుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *