మన ఈనాడు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్సీలు కలిశారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,వేణుగోపాల్ రావు,వేం నరేందర్ రెడ్డి,ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు.రవితో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్,బల్మూరి వెంకట్ ను ముఖ్యమంత్రి అభినందించారు. ఇటీవల CM రేవంత్ దావొస్ పర్యటనలో తెలంగాణకు రూ.40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఇరువురు అభినందనలు తెలిపారు.
బాలయ్య ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. ‘ఆదిత్య 369’ రీరిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకుని నటించిన చిత్రం ‘ఆదిత్య 369(Aditya 369)’. ఇది ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్(First Time Travel Science Fiction) మూవీ. దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు(Srinivasa Rao) 1991లో…