మన ఈనాడు:టీపీసీసీ(TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేసి పరాజయం చెందారు. ఆ తరువాత హెచ్ సీఎ అధ్యక్షునిగా గెలుపొందారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరు నిమిషంలో జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడంతో అక్కడ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే ఎమ్మెల్యే కోటాలోనూ, గవర్నర్ కోటాలోనూ… రెండింటిలోనూ అజహర్ పేరు లేకపోవడంతో ఆయన ఇక కాంగ్రెస్ లో కొనసాగడం ఇష్టం లేక, ఆ పార్టీ సభ్యత్వానికి, టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనే తలంపుతో ఉన్నట్టు సమాచారం.
కటింగ్లు, కటాఫ్లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను రేవంత్ సర్కార్ నట్టేట ముంచిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని…