ఫోన్ టాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది.
ఈమేరకు రాధాకిషన్రావును పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు.
కాగా రాధా కిషన్రావును ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు ప్రశ్నించబోతున్నారు. దీంతో గురువారం చంచలగూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు A4గా ఉన్నారు. అసలైన సూత్రధారులు పేర్లు వెల్లడించడంతోపాటు ఆధారాలు సేకరించబోతున్నారు. ఈవారం రోజుల్లోనే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపుతు తిరగబోతుంది. కీలకమైన నేతలకు నోటీసులు అందించడంతోపాటు విచారణకు హజరు కావాలని కోరే అవకాశం ఉందని సమాచారం.