Pebbair Market మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం..భారీగా ఆస్తినష్టం

Fire Broke At Agri Godown: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా (Wanaparthy Distic)పెబ్బేరులోని మార్కెట్ యార్డులో రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో (Market Yard) మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

మంటల్లో దాదాపు 70 వేల వరి ధాన్యం బస్తాలు కాలి బూడిదయ్యాయి. వీటి విలువ సుమారు రూ.15 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 40 లక్షల గన్నీ బ్యాగులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummula Nageswar Rao) స్పందించారు. అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంతమేరా నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Share post:

లేటెస్ట్