Advertisement

ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ గురించి అందరికీ తెలుసు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు. నటుడుగా మార్కులు పడ్డాయి కానీ సరైన హిట్ సినిమా పడలేదు..

దాంతో ఈ హీరో చాలా కాలం గ్యాప్ తీసుకొని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వెయ్ దరువెయ్ సినిమాలో నటించాడు.. ఆ సినిమా మార్చి 15 న విడుదలైంది..

గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ సినిమా కూడా ఆశించినస్థాయిలో ఫలితాలను అందుకోలేక పోయింది.. ఓ మాదిరిగా ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి.. సునీల్‌, సత్యంరాజేష్ కీలక పాత్రలు పోషించారు. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందాలని భావించి అడ్డదారులు తొక్కుతున్న యువత ఎలా కష్టాల పాలవుతున్నారనే విషయాన్ని హైలెట్ చేస్తూ ఈ సినిమాలో చూపించారు.. పాయింట్ బాగానే ఉన్నా కూడా సినిమా జనాలకు అంతగా రీచ్ అవ్వలేక పోయింది..

ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 12 నుంచి ఈ మాస్ యాక్షన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here