AP : ఏపీలో పింఛన్ల పెంపు పై కసరత్తు!

Mana Enadu:సామాజిక భద్రత పింఛన్ల పెంపు పై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపింది.పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

Increase Pensions : సామాజిక భద్రత పింఛన్ల (Pensions) పెంపు పై అధికారులు కసరత్తులు మొదలు పెట్టేశారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా టీడీపీ (TDP), జనసేన (Janasena) కూటమి ఉమ్మడి మేనిఫెస్టో లో తెలిపిన విషయం తెలిసిందే.

దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని రెండు పార్టీలు కూడా హామీనిచ్చాయి. పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి తీసుకుని వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు రంగంలోకి దిగి కసరత్తులు ప్రారంభించారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులున్నారు. వీరందరికి పింఛను నగదు కింద నెలకు రూ. 19.39 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు , దివ్యాంగులకు 6 వేల పింఛను ను జులై 1 నుంచి పంపిణీ చేయడానికి మొత్తం రూ.4,400 కోట్లు అవుతుందుని అధికారులు అంచనా వేశారు.

 

Related Posts

Video Viral : రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప పగులగొట్టిన ఈటల

పేదల భూములను ఆక్రమించిన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై మల్కాజిగిరి ఎంపీ (Malkajgiri MP) ఈటల రాజేందర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సంయమనం కోల్పోయిన ఆయన ఒక్కసారిగా బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. వెంటనే ఆయన వెంట వచ్చిన బీజేపీ నేతలు,…

కోల్​కతా ట్రైనీ డాక్టర్​ కేసు.. డెడ్ బాడీపై మహిళ డీఎన్ఏ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్ కతా ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్ పై (Kolkata Doctor Murder Case) హత్యచారం కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కి (Sanjay Roy) న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.  అయితే విచారణలో భాగంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *