AP : ఏపీలో పింఛన్ల పెంపు పై కసరత్తు!

Mana Enadu:సామాజిక భద్రత పింఛన్ల పెంపు పై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపింది.పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

Increase Pensions : సామాజిక భద్రత పింఛన్ల (Pensions) పెంపు పై అధికారులు కసరత్తులు మొదలు పెట్టేశారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా టీడీపీ (TDP), జనసేన (Janasena) కూటమి ఉమ్మడి మేనిఫెస్టో లో తెలిపిన విషయం తెలిసిందే.

దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని రెండు పార్టీలు కూడా హామీనిచ్చాయి. పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి తీసుకుని వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు రంగంలోకి దిగి కసరత్తులు ప్రారంభించారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులున్నారు. వీరందరికి పింఛను నగదు కింద నెలకు రూ. 19.39 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు , దివ్యాంగులకు 6 వేల పింఛను ను జులై 1 నుంచి పంపిణీ చేయడానికి మొత్తం రూ.4,400 కోట్లు అవుతుందుని అధికారులు అంచనా వేశారు.

 

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *