Mana Enadu: ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
ChandraBabu: ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాల గురించి బాబు స్వయంగా వివరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాబు దిశానిర్దేశం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు తేడాలు వివరించారు.
ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని ఇప్పటి ప్రభుత్వంలోకి చేర్చుకోవద్దని తెలిపారు. రాష్ట్రంలో జగన్ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాల్సి ఉందని బాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని అన్నారు.
శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం అని వివరించారు. ఇక, మంత్రులు ఇష్టాయిష్టాలు, వారి సమర్థత మేరకు గురువారం లోగా శాఖలు కేటాయిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అని బాబు మంత్రులకు స్పష్టం చేశారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…