ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. దీంతో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు అరడజను పెద్దసైజు నిమ్మకాయలకు రూ.20లకు విక్రయించారు. రెండురోజులుగా రూ.40-రూ.50ల ధర పలుకుతుంది. విడిగా అయితే పెద్దసైజు నిమ్మకాయ రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున అమ్ముతున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
వేసవి తాపం తీర్చకునేందుకు మజ్జిగ, నాన్వెజ్ ఇలా ప్రతి దాంట్లో నిమ్మకాయ వాడతాము. నిమ్మరసం తాగడానికి వేసవిలో అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తాం. మరోవైపు చెరుకురసంలో ఇప్పటివరకు నిమ్మరసం ఇచ్చేవారు. నిమ్మకాయ రేట్లు పెరగడంతో కేవలం అల్లంతోనే సరిపెట్టుకోమని చెబుతున్నారు.